ఆంధ్రప్రదేశ్‌లో పాలన గతి తప్పింది: కేవీపీ | KVP Slams Ruling Government | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో పాలన గతి తప్పింది: కేవీపీ

Apr 18 2018 9:29 AM | Updated on Mar 18 2019 9:02 PM

KVP Slams Ruling Government - Sakshi

కేవీపీ రామచంద్రరావు( పాత చిత్రం)

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పాలన గతి తప్పిందని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..ఏపీలో నగదు కొరత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏటీఎంలలో డబ్బుల్లేక ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలు శూన్యమన్నారు.

పెద్ద నోట్ల రద్దును స్వాగతించిన చంద్రబాబు..సమస్యల పరిష్కార కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారన్న సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. పంచాయతీ స్థాయి నుంచి సీఎం పేషీ వరకు అవినీతి తాండవిస్తోందని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల్ని విస్మరించి రాజకీయ, అధికారిక సమావేశాలు, సమీక్షలకే చంద్రబాబు పరిమితం కావడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement