కర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం | karnataka Speaker Ramesh Kumar Disqualify On 14 Members | Sakshi
Sakshi News home page

కర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం

Jul 28 2019 12:22 PM | Updated on Jul 28 2019 8:18 PM

karnataka Speaker Ramesh Kumar Disqualify On 14 Members - Sakshi

సాక్షి, బెంగళూరు: గత కొంతకాలంగా ఉత్కంఠ రాజకీయాలకు వేదికయిన కర్ణాటకలో అసెంబ్లీ స్పీకర్‌ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మొత్తం 14 మంది రెబల్‌  ఎమ్మెల్యేలపై స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ అనర్హత వేటు వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్‌.. తాజాగా 13 మంది కాంగ్రెస్‌, ఓ స్వతంత్ర సభ్యుడిపై అనర్హత వేటు వేశారు. దీంతో వేటు పడిన మొత్తం సభ్యుల సంఖ్య 17కి చేరింది. స్పీకర్‌ తాజా నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.. దీంతో వారంత నాలుగేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారు.

మరోవైపు సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ ఉంటుందని, సభ్యులంతా దీనికి హాజరుకావాలంటూ స్పీకర్‌ ఆదేశాలు జారీచేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినా తాను మాత్రం స్పీకర్‌ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. శుక్రవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడియూరప్ప.. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. 17 మంది సభ్యులపై అనర్హత వేట పడడంతో.. సభలో మొత్తం సభ్యుల సంఖ్య 208కి పడిపోయింది. దీంతో మేజిక్‌ ఫిగర్‌ 104కి చేరింది. బీజేపీకి ప్రస్తుతం 105 మంది సభ్యులు ఉండగా.. ఓ స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. దీంతో విశ్వాస పరీక్షలో బీజేపీ సునాయాసంగా నెగ్గే అవకాశం ఉంది.

అనర్హత వేటుకు గురయిన ఎమ్మెల్యేలు వీరే..
కాంగ్రెస్‌
బస్వరాజు
మునిరత్నం
సోమశేఖర్‌
రోషన్‌బేగ్‌
ఆనంద్‌సింగ్‌
నాగరాజు
బీసీ పాటిల్‌
ప్రతాప్‌ గౌడ్‌
సుధాకర్‌
శివరాం హెబ్బర్‌
మంత్‌ పాటిల్‌

రమేష్‌ జార్జ్‌హోళి
మహేష్‌

జేడీఎస్‌
గోపాలయ్య
నారాయణ గౌడ్‌
విశ్వనాథ్‌
శంకర్‌(స్వతంత్ర)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement