మళ్లీ దొరల చేతిలో అధికారం పెట్టొద్దు: ఐలయ్య  | Kancha Ilaiah comments on TRS and KCR | Sakshi
Sakshi News home page

మళ్లీ దొరల చేతిలో అధికారం పెట్టొద్దు: ఐలయ్య 

Sep 9 2018 1:55 AM | Updated on Sep 9 2018 1:55 AM

Kancha Ilaiah comments on TRS and KCR - Sakshi

నిర్మల్‌ అర్బన్‌: ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయొద్దని.. మళ్లీ దొరల చేతిలో అధికారం పెట్టవద్దని టీమాస్‌ రాష్ట్ర చైర్మన్‌ ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య పిలుపునిచ్చారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో శనివారం‘ఓటు హక్కు–ఎన్నికల సంస్కరణ’పై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని వర్గాల ప్రజలు త్యాగాలు చేశారని, కానీ సామాజిక తెలంగాణ రాకుండా వెలమ, రెడ్ల చేతుల్లోకి అధికారం వెళ్లిందన్నారు. ఈసారి వారిని గెలవనీయవద్దని చెప్పారు.

ఉద్యమాన్ని తమ ఆటపాటల ద్వారా ఉవ్వెత్తున నిలిపిన గద్దర్, విమలక్కలకు మద్దతునిస్తూ కేసీఆర్, కేటీఆర్‌లపై పోటీ చేయాలని కోరినట్లు చెప్పారు.  టీమాస్‌ అధికారంలోకి వస్తే సోషలిస్ట్‌ వెల్ఫేర్‌ ఎజెండాను అమలు చేస్తామని, ఎమ్మెల్యేల వేతనాలను ఎత్తేస్తామని, రూ.3కే టిఫిన్, రూ.5 బహుజన బువ్వ, ఇంటర్మీడియెట్‌ను రద్దు చేసి కేజీ నుంచి 12వ తరగతి వరకు గ్రామంలోనే ఆంగ్లబోధన అందేలా చూస్తామని వివరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement