21న మదురైలో కమల్‌ పార్టీ ప్రకటన

Kamal Haasan to unveil flag on Feb 21 - Sakshi

సాక్షి, చెన్నై: ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్‌ తమిళనాడు పర్యటనకు సర్వం సిద్ధమైంది. 21న రామేశ్వరం నుంచి మదురై జిల్లాలోని ఒత్తకడై వరకూ పర్యటించనున్న కమల్‌ అదే రోజు పార్టీ పేరు, సిద్ధాంతాలను ప్రకటించడంతో పాటు జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ నెల 21న ఉదయం దివంగత రాష్ట్రపతి కలాం నివాసం నుంచి కమల్‌ పర్యటన మొదలుకానుంది. ఉదయం కలాం పాఠశాలను సందర్శించాక జాలర్ల సంఘాల నేతలతో కమల్‌ మాట్లాడతారు. రామనాథపురం, పరమకుడి జంక్షన్, మానామదురైలలో జరిగే సభలలో ప్రసంగిస్తారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top