కాంగ్రెస్‌ హయాంలోనే కల్వకుర్తి పనులు: మల్లు | Kallavakurti works started in Congress ruling | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ హయాంలోనే కల్వకుర్తి పనులు: మల్లు

Oct 17 2017 2:26 AM | Updated on Oct 17 2017 2:26 AM

Kallavakurti works started  in Congress ruling

సాక్షి, హైదరాబాద్‌: కల్వకుర్తి ప్రాజెక్టు పనులు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయని టీపీసీసీ ఉపా ధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ప్రాజెక్టు కాల్వలు పూర్తి చేసి, తామే కల్వకుర్తి ప్రాజె క్టును తెచ్చినట్లు టీఆర్‌ఎస్‌ గోబెల్స్‌ ప్రచా రం చేస్తోందని మండిపడ్డారు.

గాంధీ భవ న్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నెట్టెంపాడు, కోయల్‌ సాగర్‌ తదితర పెండింగ్‌ ప్రాజెక్టులకు రూ. 10 వేల కోట్లు నిధులిస్తే పనులు పూర్తవు తాయని వివరించారు. రైతుల కోసం టీఆర్‌ఎస్‌ పనిచేస్తుంటే.. రైతులకు వ్యతి రేకంగా కాంగ్రెస్‌ పనిచేస్తోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించడం హాస్యా స్పదంగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement