త్వరలో జనసేన ప్లీనరీ
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ త్వరలో పార్టీ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ అధినేత పవన్కల్యాణ్ అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్లో ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ మీడియా విభాగం హెడ్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్లీనరీ ఎప్పుడు, ఎక్కడ నిర్వహించా లన్న అంశంపై కొన్ని ప్రతిపాదనలు వచ్చాయని, దీనిపై అధినేత తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు రెండు రాష్ట్రాల్లో పవన్ పర్యటనపైనా సమావేశంలో చర్చించినట్టు పేర్కొన్నారు.