దేశం ఓ గొప్ప నేతను కోల్పోయింది

India Has Lost One Great Leader Said By YS Jagan - Sakshi

హైదరాబాద్‌: భారత మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతిపట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దేశం ఓ గొప్ప నేతను కోల్పోయిందన్నారు. భారతరత్న వాజ్‌పేయి మరణించారన్న వార్త ఎంతగానో బాధించిందని తెలిపారు. అటల్‌జీ మరణంతో మన దేశ రాజకీయాల్లో ఓ గొప్పశకం ముగిసినట్టయిందని పేర్కొన్నారు.

విభేదించే రాజకీయ పార్టీల వారికి కూడా ఆమోదయోగ్యుడిగా, అద్భుతమైన-ఆకట్టుకునే వక్తగా, కవిగా, రాజకీయ విలువలూ మర్యాదల పరంగా శిఖర సమానుడిగా, విదేశీ దౌత్య దురంధరుడిగా, పార్లమెంటరీ సంప్రదాయాల పరంగా మహోన్నతుడిగా వాజ్‌పేయి అందరి మన్ననలూ పొందారని..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ప్రకటన ద్వారా తెలియజేశారు.

ఓ చరిష్మా ఉన్న లీడర్‌ను దేశం కోల్పోయింది: విజయసాయి రెడ్డి(వైఎస్సార్‌సీపీ ఎంపీ)

దేశం ఓ చరిష్మా ఉన్న, అత్యంత గౌరవనీయుడైన వ్యక్తిని కోల్పోయిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. అటల్‌జీ మృతి బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top