విజయవాడ: పోలవరం ప్రాజెక్టును తాము కడతామని టీడీపీ తీసుకోవడం వల్లే చిక్కులు మొదలయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు వ్యాఖ్యానించారు. విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ..
కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టును రాష్ట్రం తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లుగా కీలక అంశాలపై ప్రతిపక్షంతో ఎందుకు సీఎం సంప్రదింపులు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం సంస్కారం ఏమయ్యిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని సీఎం పాతాళానికి తొక్కేస్తున్నాడని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ఆలోచన ఈ సీఎంకు లేదని వ్యాఖ్యానించారు. విభజన హామీలను కేంద్రం విస్మరించిందని,11 జాతీయ విద్యా సంస్థలకు రూ.6,600 కోట్లు రావాల్సి ఉండగా..కేంద్రం కేవలం రూ. 450కోట్లు ఇవ్వడం దారుణమన్నారు. పోలవరం నిర్మాణానికి రాష్ట్రం పెట్టిన ఖర్చుకు ఇంకా నిధులు రావాల్సి ఉందన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమం తరహాలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు అనే మాట సీఎం నోటి నుంచి రావడం బాధాకరమన్నారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ డ్రామాలు ఆడుతోందన్నారు. మరో స్వతంత్ర పోరాటం అంటూ మాయమాటలు చెబుతున్నారని అన్నారు.
బీజేపీపై పోరాటానికి అందరూ ముందుకు రావాలని కోరారు.ఎన్నికల సంస్కరణలు అవసరమని, ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యత పెరుగుతోందని,35 శాతం ముఖ్యమంత్రులు నేర నేపథ్యం కలిగిన వారు ఉన్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం తమ ఆదాయ వివరాలను ప్రకటించాలన్నారు. టీడీపీలోని అవినీతి ప్రజాప్రతినిధుల వ్యవహారంను కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఉద్యమంతోనే సమాధానమిస్తామని చెప్పారు. ఈ విషయంపై రేపు వామపక్ష పార్టీలతో పాటు అన్ని పార్టీలతో చర్చలు జరుపుతామని తెలిపారు.
టీడీపీతోనే పోలవరానికి చిక్కులు: సీపీఎం
Published Tue, Feb 13 2018 4:43 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement