మోదీ వెబ్‌ సిరీస్‌ను నిలిపివేయండి: ఈసీ 

Election Commission Of India Bans Web Series On Narendra Modi - Sakshi

న్యూఢిల్లీ : దేశంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీ జీవితం ఆధారంగా రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ‘మోదీ జర్నీ ఆఫ్‌ ఏ కామన్‌ మ్యాన్‌’ ప్రసారాన్ని నిలిపివేయాలని ‘ఎరోస్‌ నౌ’ సంస్థను ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశించింది. మోదీ వెబ్‌ సిరీస్‌కు సంబంధించి ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న 5 ఎపిసోడ్‌లను నిలిపివేయాలంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ఆపేయాలని ఆదేశిస్తూ శనివారం నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయ నాయకులకు సంబంధించిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రసారం చేయకూడదని ఈ నెల 10న ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top