సీపీఐ అభ్యర్థులు..

CPI releases list of 3 candidates for Telangana Assembly polls - Sakshi

చాడ, మల్లేశ్, విజయాబాయి

సాక్షి, హైదరాబాద్‌: మహాకూటమిలో భాగంగా సీపీఐకి కేటాయించిన మూడు స్థానా ల్లో అభ్యర్థులను ఆ పార్టీ బుధవారం ప్రకటించింది. హుస్నాబాద్‌ అభ్యర్థిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, బెల్లంపల్లి నుంచి గుండ మల్లేశ్, వైరా నుంచి బానోతు విజయాబాయి లు పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి బుధవారం జాబితా విడుదల చేశారు. అనంతం విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ను గద్దె దింపాలనే ఉద్దేశం తో మహాకూటమి ఏర్పాటైందని, సీట్ల కేటాయింపు లో కొంత అసంతృప్తి ఉన్నా కూటమి గెలుపు కోసం వాటిని పక్కన పెట్టినట్లు తెలిపారు. తమకు కేటా యించిన మూడు సీట్లే ఫైనల్‌ అని, నల్లగొండలోని దేవరకొండ సీటు ఇస్తే తీసుకుంటామే తప్ప మరోసారి కాంగ్రెస్‌తో సీట్ల గురించి మాట్లాడేది లేదన్నా రు. చాడ వెంకట్‌రెడ్డిపై రెబెల్‌గా పోటీ చేస్తానంటున్న కాంగ్రెస్‌ నేత ప్రవీణ్‌రెడ్డి విషయాన్ని ఆ పార్టీ పెద్దలు చూసుకోవాలన్నారు. తిరుగుబాటు అభ్యర్థులు ఉండకూడదనే ఉద్దేశంతోనే తమకు కేటాయించిన 3 సీట్ల నుంచే బరిలోకి దిగుతున్నామని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top