మార్చి 16 నుంచి కాంగ్రెస్‌ జాతీయ ప్లీనరీ.. | Congress national plenary tobe held from 16th March | Sakshi
Sakshi News home page

మార్చి 16 నుంచి కాంగ్రెస్‌ జాతీయ ప్లీనరీ..

Feb 17 2018 6:51 PM | Updated on Feb 17 2018 9:37 PM

Congress national plenary tobe held from 16th March - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) ప్లీనరీ తేదీలు ఖరారయ్యాయి. మార్చి 16 నుంచి 18 వరకు ఢిల్లీలో జాతీయ ప్లీనం జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు శనివారం ఒక ప్రకటన చేశాయి. జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికకు ఆమోదం తెలపడం, నూతన వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) ఏర్పాటు లాంటి తీర్మానాలను ప్రతినిధులు ఆమోదించనున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న కాంగ్రెస్‌ ఈ సమావేశాలను కీలకంగా భావిస్తున్నది. కాగా, ప్లీనరీ నిర్వహణ కోసం 34 మంది సభ్యులతో ఏర్పాటయిన స్టీరింగ్‌ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం దక్కకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement