ములుగు: కాంగ్రెస్ తరఫున ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన ధనసరి అనసూయ(సీతక్క) టీఆర్ఎస్లో చేరనున్నారనే ప్రచారం స్థానికంగా సాగుతోంది. ఈ విషయం రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి తోడు గురువారం ఓ ప్రధాన టీవీ ఛానల్లో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో పాటు సీతక్క సైతం కారు ఎక్కనున్నట్లు స్క్రోలింగ్ రావడంతో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు హన్మకొండలోని సీతక్క నివాసానికి వెళ్లారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘోర పరాజయం పాలు కావడంతోనే ఆమె టీఆర్ఎస్ చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుండగా, అధికార పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేసింది.
పార్టీలో చేరగానే పదవి.. ఆపై ఎమ్మెల్యే
టీడీపీలో ఉన్న సీతక్క గత అక్టోబర్లో కాంగ్రెస్లో చేరారు. దీంతో ఆమెకు ఏఐసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వడం తో పాటు ములుగు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న పొదెం వీరయ్యను కాదని ఆమెకు అసెంబ్లీ టికెట్ కూడా ఇచ్చారు. ఆ ఎన్నికల్లో సీతక్క భారీ మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినా సీతక్క మాత్రం అలాగే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ములుగు నియోజకవర్గంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతుండడంతో సీతక్క మరో వారం రోజుల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది.
అదంతా తప్పుడు ప్రచారమే..
కొంతమంది నాయకులు గతంలోనే టీఆర్ఎస్లో చేరాలని కోరినా తాను వెళ్లలేదని సీతక్క స్పష్టం చేశారు. ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్ నాయకులు ఇదే విషయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో నిజం లేదని, కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
టీఆర్ఎస్లోకి సీతక్క?
Published Fri, Jun 7 2019 5:32 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఆలస్యం చేయొద్దు.. కదలండి ఓటేయండి.. (ఫొటోలు)
ఓటు వేసిన వైఎస్సార్సీపీ నేతలు (ఫొటోలు)
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
Election 2024 Voters Selfie Photos: ఓటు హక్కు వజ్రాయుధం (ఫొటోలు)
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం
తొలిసారి ఓటేశారు (ఫొటోలు)
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతల దాడి
నా ఓటు .. నా హక్కు (ఫొటోలు)
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement