సీఎం కన్నా ఊసరవెల్లి నయం | Sakshi
Sakshi News home page

సీఎం కన్నా ఊసరవెల్లి నయం

Published Sun, Mar 18 2018 8:13 AM

chameleon is better than CM - Sakshi

ఆళ్లగడ్డ: పూటకో మాట మార్చుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కన్నా ఊసరవెల్లి నయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఓటుకు నోటు కేసుకు భయపడి సీఎం చంద్రబాబు హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారని విమర్శించారు.

ఆయన అసమర్థతతోనే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నారు. దోచుకునేందుకే ప్యాకేజీ  ఒప్పకున్నారని  ఆరోపించారు. అదే ఏపీకి హోదా వచ్చి ఉంటే పరిశ్రమలు ఏర్పడి యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేవి అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు హోదా కోసం పోరాడుతున్న  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలిపి చిత్తశుద్ధిని నిరుపించుకోవాలన్నారు.     

Advertisement
Advertisement