ప్రజా సంక్షేమమే లక్ష్యం | BJP President Amit Shah Takes Charge As Home Minister | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే లక్ష్యం

Jun 2 2019 4:20 AM | Updated on Jun 2 2019 4:20 AM

BJP President Amit Shah Takes Charge As Home Minister - Sakshi

అమిత్‌షాకు పుష్పగుచ్ఛమిస్తున్న సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి. చిత్రంలో సహాయమంత్రి నిత్యానంద్‌

న్యూఢిల్లీ: దేశ భద్రత, ప్రజా సంక్షేమమే మోదీ ప్రభుత్వ ప్రథమ లక్ష్యాలని నూతన హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. హోం మంత్రిగా రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన ఆయన శనివారం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్‌ షాకు హోం మంత్రిత్వ శాఖ పనితీరు, ప్రస్తుతం శాఖకు సంబంధించిన కీలక అంశాలను అధికారులు వివరించారు. షాతో పాటు సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన జి.కిషన్‌రెడ్డి, నిత్యానంద్‌ రాయ్‌ కూడా దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు నార్త్‌బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ రాజీవ్‌ జైన్‌ తదితర సీనియర్‌ అధికారులు మంత్రి అమిత్‌ షాకు ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం అమిత్‌ షా ట్విట్టర్‌లో..‘దేశ భద్రత, ప్రజా సంక్షేమం మోదీ ప్రభుత్వం ప్రథమ లక్ష్యాలు. మోదీజీ నేతృత్వంలో ఈ లక్ష్యాల సాధనకు శాయశక్తులా కృషి చేస్తా’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement