దోహలో ఘనంగా జగన్‌ జన్మదిన వేడుకలు

ys jagan birthday celebrations in doha - Sakshi

దోహా : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలను ఖతార్‌ రాజధాని దోహలో దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా శశికిరణ్ మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ 400 కిలోమీటర్ల మైలు రాయి దాటిన ప్రజానేత జగన్మోహన్ రెడ్డికి ఖతార్‌లో ఉన్న తెలుగు వారి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని, వారి ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధిస్తున్నామన్నారు.

కె. శివప్రసాద్ మాట్లాడుతూ.. ఖతార్‌లో ఏర్పడే నూతన కమిటీ సభ్యులు తమ శక్తి కొలది పార్టీ అభ్యున్నతికి పని చేస్తూ ఖతార్‌లో ఉన్న తెలుగు వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఖతార్ తెలుగుకళాసమితి వ్యవస్ధాపకులు  కె. శివప్రసాద్, జాఫర్ హుస్సేన్, ప్రముఖ వ్యాపారవేత్త ఎస్. సాంబశివ రావు, పారిశ్రామకవేత్త సామాజిక సేవకులు ఆర్. సూర్యప్రకాష్ రావు, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి.హెచ్, గల్ఫ్ ప్రతినిధి వర్జిల్ బాబు, వర్ధనపు  ప్రకాష్, ఎస్. షాహాబుద్దీన్, ఎన్. నాగేశ్వరరావు, ఎన్. జయరాజు, మట్ట రాజు, ఎం. సందేష్ కుమార్, ఎం.బి. ప్రశాంత్, జి. చంటి, బి. గిరిధర్, తదితరులు పాల్గొన్నారు.  

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top