ఫ్రాన్స్‌లో 'వాక్‌ విత్ జగనన్న' | Walk with Jagan Anna in France | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌లో 'వాక్‌ విత్ జగనన్న'

Jan 29 2018 4:03 PM | Updated on Jul 25 2018 5:17 PM

Walk with Jagan Anna in France - Sakshi

పారిస్‌ : కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసాగా నిలిచే లక్ష్యంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్ప యాత్ర సోమవారం వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లోని వైఎస్‌ జగన్ అభిమానులు ‘వాక్‌ విత్‌ జగనన్న‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవుడి ఆశీస్సులతో ప్రజాసంకల్పయాత్ర 3000 కిలో మీటర్లు విజయవంతంగా పూర్తి చేసుకోవాలని  ఆశిస్తున్నామన్నారు. వైఎస్‌ జగన్‌ వచ్చే ఎన్నికల్లో సీఎం కావాలని కోరుకుంటున్నామని, రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌ సీఎం కావాలని ఫ్రాన్స్‌లోని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు.


Advertisement
 
Advertisement
Advertisement