యూపీఏ2 వీడ్కోలు బహుమతి | UPA-2's costly mistake: failure to curb rising prices | Sakshi
Sakshi News home page

యూపీఏ2 వీడ్కోలు బహుమతి

May 8 2014 3:59 AM | Updated on Jul 11 2019 5:01 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఏ 2 ప్రభుత్వం వీడ్కోలు బహుమతి ప్రకటించింది. ఉద్యోగుల పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ అలవెన్సును నెలకు రూ. 1500లకు పెంచింది.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఏ 2 ప్రభుత్వం వీడ్కోలు బహుమతి ప్రకటించింది. ఉద్యోగుల పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ అలవెన్సును నెలకు రూ. 1500లకు పెంచింది. గతంలో ఈ మొత్తం నెలకు వెయ్యి రూపాయలుగా ఉండేది. వికలాంగ మహిళా ఉద్యోగుల పిల్లలకిచ్చే ప్రత్యేక అలవెన్సును కూడా నెలకు వెయ్యి రూపాయల నుంచి రూ. 1500 చేస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే,  వికలాంగ పిల్లలున్న ఉద్యోగులకిచ్చే ప్రత్యేక భత్యాన్ని నెలకు రూ. 3000 చేసింది. ఇప్పటివరకు అది రూ. 2000గా ఉంది. ఈ మార్పులు 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement