లాక్‌డౌన్‌ నుంచి నిష్క్రమణ ఎలా?

Union Minister Jitendra Singh explores lockdown exit plans with ex-bureaucrats - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటం, లాక్‌డౌన్‌ నుంచి నిష్క్రమణ ప్రణాళికపై కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ శనివారం మాజీ సివిల్‌ సర్వీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సుదీర్ఘంగా చర్చించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వారికి వివరించారు. కరోనా కట్టడి విషయంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్‌ ముందంజలో ఉందని పేర్కొన్నారు. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడానికి లాక్‌డౌన్‌ తర్వాత అమలు చేయాల్సిన చర్యలు, లాక్‌డౌన్‌ నుంచి నిష్క్రమణ ప్రణాళికపై సంప్రదింపులు జరిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top