వాట్స్‌ యాప్‌లో స్మృతిపై అభ్యంతరకర చిత్రాలు | uma shankar uploaded smriti irani's photos in watsapp | Sakshi
Sakshi News home page

వాట్స్‌ యాప్‌లో స్మృతిపై అభ్యంతరకర చిత్రాలు

Apr 19 2015 3:57 AM | Updated on Oct 22 2018 2:09 PM

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభ్యంతరకంగా ఉన్నట్లు చూపే చిత్రాలను సామాజిక అనుసందాన వే దిక(వాట్స్‌యాప్)లో పెట్టిన బిహార్ ఎల్‌జే పీ నేత ఉమా శంకర్ మిశ్రాపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

  • ఎల్‌జేపీ నేతపై కేసు నమోదు
  • పాట్నా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభ్యంతరకంగా ఉన్నట్లు చూపే చిత్రాలను సామాజిక అనుసందాన వే దిక(వాట్స్‌యాప్)లో పెట్టిన బిహార్ ఎల్‌జే పీ నేత ఉమా శంకర్ మిశ్రాపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమా శంకర్ తన మొబైల్ ద్వారా స్మృతి ఇరానీ చిత్రాలను వాట్స్‌యాప్‌లో పెట్టడమే కాకుండా తమ నేతలకు కూడా పంపాడని స్థానిక బీజేపీ నేత రాజీవ్ రంజన్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు అందజేశామని రాజీవ్ తెలిపారు.

    స్మృతి ఇరానీ, బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలాంటి పనులు చేస్తున్నారని రాజీవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడైన  ఉమా శంకర్ మిశ్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎల్‌జేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ను కోరారు. సైబర్ క్రైం  బ్రాంచ్ పోలీసులు ఈ కేసుపై విచారణను మొదలుపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement