పాక్ కాల్పులు : ఇద్దరు భారతీయులకు గాయాలు | Two injured in Pakistan shelling in Jammu | Sakshi
Sakshi News home page

పాక్ కాల్పులు : ఇద్దరు భారతీయులకు గాయాలు

Oct 25 2015 8:57 AM | Updated on Mar 23 2019 8:44 PM

పాకిస్థాన్ మళ్లీ మళ్లీ కాల్పులకు తెగబడుతూ తన తెంపరితనాన్ని చాటుకుంటుంది.

జమ్మూ : పాకిస్థాన్ మళ్లీ మళ్లీ కాల్పులకు తెగబడుతూ తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. పాక్ సైన్యం వరుసగా రెండో రోజు సాంబా జిల్లాలోని బీఎస్ఎఫ్ జవాన్ల ఔట్ పోస్ట్లే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. గాయపడిన వారు కల్షో దేవి ప్రీతం చంద్గా గుర్తించినట్లు చెప్పారు. గత రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ కాల్పులు ... ఈ రోజు తెల్లవారుజాము 3.00 గంటల వరకు నిరంతరాయంగా జరుగుతునే ఉన్నాయని తెలిపారు.

అయితే శుక్రవారం జమ్మూ ప్రాంతంలో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా... పలు పశువులు గాయాలపాలైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పాక్ సైన్యం సాంబా జిల్లాలోని బీఎస్ఎఫ్ జవాన్ల జౌట్ పోస్ట్లే లక్ష్యంగా కాల్పులు జరిపిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement