ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురి మృతి

Truck Overturns On Road In Madhya Pradesh - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌ జిల్లా పఠా రోడ్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఆగ్రాకు మామిడిపళ్ల లోడుతో వెళుతున్న ట్రక్‌ పఠారోడ్‌ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందగా, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రక్కులో 16 మంది ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top