జమ్మూకాశ్మీర్లో భారీ వరదల్లో తెలుగు ప్రజలు చిక్కుకున్నారు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో భారీ వరదల్లో తెలుగు ప్రజలు చిక్కుకున్నారు. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు, యాత్రకు వెళ్లిన వారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
శ్రీనగర్ ఎన్ఐటీలో 50 మంది తెలుగు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎన్ఐటీ క్యాంపస్ను వరద నీరు చుట్టుమట్టడంతో విద్యార్థులు సిబ్బంది అతికష్టమ్మీద బయపడ్డారు. విద్యార్థులను లేహ్-లడఖ్కు తరలించారు. కాశ్మీర్ వరదల్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ దంపతులు కూడా చిక్కుకున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మరో 200మందికి పైగా విద్యార్ధులు ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు.