సినిమా వేడుకలకు తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్ల విరాళం | tamil nadu Chief Minister J. Jayalalithaa donated rs. 10 crores for cinema festivals | Sakshi
Sakshi News home page

సినిమా వేడుకలకు తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్ల విరాళం

Sep 18 2013 9:04 PM | Updated on Aug 11 2018 8:27 PM

వందేళ్ల సినిమా వేడుకలకు తమిళనాడు ప్రభుత్వ చేయూతనిచ్చింది.

చెన్నై:వందేళ్ల సినిమా వేడుకలకు తమిళనాడు ప్రభుత్వ చేయూతనిచ్చింది. త్వరలో జరుగనున్న సినిమా వేడుకలను పురస్కరించుకుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత రూ.10 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఈ నెల 21 నుంచి భారతీయ సినిమా శత జయంతి వేడుకలు చెన్నైలో జరుగుతున్న సంగతి తెలిసిందే.  శత జయంతి వేడుకల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం భారీ మొత్తంలో విరాళం ప్రకటించడం విశేషం. ఈ మేరకు దక్షిణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కల్యాణ్ కు రూ.10 కోట్ల చెక్కును జయలలిత అందజేశారు.

 

భారతీయ సినీ చరిత్రలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తమిళులు విరాళాన్ని ప్రకటించడంలో కూడా తనదైన ముద్రను వేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement