జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాది అరెస్ట్ | Suspected Jaish Terrorist Arrested in Jammu and Kashmir's Baramulla | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాది అరెస్ట్

May 15 2016 9:57 AM | Updated on Aug 20 2018 4:44 PM

పఠాన్ కోట్ దాడిలో ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

శ్రీనగర్: పఠాన్ కోట్ దాడిలో ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న  జైషే మహ్మద్ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాద ఆత్మాహుతి దళానికి చెందిన అబ్దుల్ రహ్మాన్ ఖాన్ గా గుర్తించారు.  

అతని నుంచి ఒక ఏకే 47 గన్,నాలుగు గ్రనెడ్లు, ఒక వైర్ లెస్ సెట్, నకిలీ ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.  ఆర్మీజాయింట్ ఆపరేషన్ల సమయంలో అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు.  పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఆత్మాహుతి దళంలో శిక్షణ తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement