‘కిరాయిదారుల ఖాళీ’ కేసులకు ప్రాధాన్యం | Sakshi
Sakshi News home page

‘కిరాయిదారుల ఖాళీ’ కేసులకు ప్రాధాన్యం

Published Mon, Jul 31 2017 1:00 AM

‘కిరాయిదారుల ఖాళీ’ కేసులకు ప్రాధాన్యం - Sakshi

న్యూఢిల్లీ: కిరాయిదారులను ఖాళీ చేయించడంలో వివాదం నెలకొన్న కేసులకు ప్రాధాన్యతనిచ్చి త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు కిందికోర్టులకు సూచించింది. ఈ కేసులు దీర్ఘకాలం కొనసాగడం వల్ల స్థల యజమానులు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంది. యజమాని ఆ స్థలాన్ని తన సొంత అవసరాలకు వాడుకోవటం కోసం అద్దెకున్న వారిని ఖాళీ చేయించే కేసులకు మరింత ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంది. కేరళకు చెందిన, దశాబ్దానికి పైగా పెండింగ్‌లో ఉన్న ఇలాంటి ఓ కేసు విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది.

Advertisement
Advertisement