కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో మహిళల ప్రవేశాన్ని నిషేధించడాన్ని సవాల్ చేసిన న్యాయవాదికి రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో మహిళల ప్రవేశాన్ని నిషేధించడాన్ని సవాల్ చేసిన న్యాయవాదికి రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఆయనకు భద్రత కల్పించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఢిల్లీ పోలీసు చీఫ్ ను కోరింది. ఆయనకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చూడాలని సూచించింది.
తమ సభ్యులకు ఫోన్లు వస్తున్నాయంటూ ఢిల్లిలోని ఇండియన్ యంగ్ లాయర్స్ అసొసియేషన్ కు చెందిన ఓ మహిళా సభ్యురాలు పిల్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం నిషేధంపై ఇండియన్ యంగ్ లాయర్స్ అసొసియేషన్.. సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.