ఓటు హక్కు వినియోగించుకున్న రజనీకాంత్! | Superstar Rajnikant votes in Chennai | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు వినియోగించుకున్న రజనీకాంత్!

Apr 24 2014 10:03 AM | Updated on Aug 15 2018 2:14 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం ఉదయం ఓటు హక్కును వినియోగించుకున్నారు

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ గురువారం ఉదయం ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోయెస్ గార్డెన్ ప్రాంతంలోని ఓ పోలింగ్ బూత్ లో రజనీ ఓటు వేశారు. తమిళనాడులో 39 లోకసభ స్థానాలకు, ఓ అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగుతోంది. 
 
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఇటీవల రజనీకాంత్ ను ఆయన నివాసంలో కలుసుకుని బీజేపీ కూటమికి మద్దతివ్వాలని కోరిన సంగతి తెలిసిందే.
 
మోడీ అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించినప్పటికి.. బహిరంగంగా ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. తమిళనాడులోని పలుపార్టీలతో బీజేపీ పొత్తు కుదుర్చుకుని బలమైన కూటమిగా ఏర్పడేందుకు కృషి చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement