సుశాంత్​ కేసులో సీబీఐ విచారణ జరగాలి: స్వామి

subramanian Swamy backs demand for cbi inquiry in sushant singh rajput suicide case - Sakshi

ముంబై: సినీ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్యపై కేంద్ర దర్యాప్తు సంస్ధ(సీబీఐ)తో విచారణ జరిపించాలని మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణియన్ స్వామి డిమాండ్​ చేశారు. న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు ఇష్కారణ్ సింగ్​ భండారీతో సుశాంత్ కేసు సీబీఐ విచారణకు తగినదో లేదో కనుక్కోవాలని చెప్పినట్లు ట్విట్టర్​ వేదికగా శుక్రవారం వెల్లడించారు. (నిషేధిత చైనా యాప్‌ కంపెనీలకు 79 ప్రశ్నలు)

ఈ కేసులో పోలీసుల వెర్షన్ సరైనదైనా అనే కోణంలో కూడా పరిశీలన చేయాలని భండారీతో చెప్పినట్లు స్వామి మరో ట్వీట్​లో పేర్కొన్నారు. యూట్యూబ్​ లైవ్​లో సుశాంత్​ ఆత్యహత్య ఘటనపై సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడతారని భండారీ ట్వీట్​ చేశారు. (పాకిస్తాన్‌కు అమెరికా భారీ షాక్)

ప్రస్తుతం ముంబై పోలీసులు సుశాంత్​ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటిదాకా 30 మంది నుంచి స్టేట్​మెంట్లు తీసుకున్నారు. అందులో సుశాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వృత్తికి సంబంధించిన వారు ఉన్నారు. ఇటీవల సంజయ్ లీలా బన్సాలీ కూడా పోలీసులకు స్టేట్​మెంట్​ ఇచ్చారు. ఆయన సుశాంత్​కు బాజీరావు మస్తానీ, రామ్​లీలా, పద్మావత్ సినిమాలను ఆఫర్ చేశారు. అయితే, డేట్స్​ కుదరకపోవడం వల్లే ఆ సినిమాలు చేయలేకపోయామని ఆయన వెల్లడించారు.

సుశాంత్​ కేసుకు సంబంధించిన సమాచారం ఉంటే ఎవరైనా తనకు సాక్ష్యాధారాలతో సహా పంపొచ్చని భండారీ పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ రూపా గంగూలీ, పుస్తక రచయిత తుహిన్​ సిన్హా, బీజేపీ ఎంపీ మనోజ్​ తివారీతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సుశాంత్​ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top