స్వచ్ఛభారత్లో ప్రియాంక వైవిధ్యం! | Priyanka Chopra contributes to Swachh Bharat Abhiyan | Sakshi
Sakshi News home page

స్వచ్ఛభారత్లో ప్రియాంక వైవిధ్యం!

Nov 24 2014 5:59 PM | Updated on Apr 3 2019 6:23 PM

స్వచ్ఛభారత్లో ప్రియాంక వైవిధ్యం! - Sakshi

స్వచ్ఛభారత్లో ప్రియాంక వైవిధ్యం!

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఇప్పటికి చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఈ విషయంలో అందరి కంటే ఓ అడుగు ముందుకేసింది.

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఇప్పటికి చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. అయితే, అక్కడక్కడ ఉన్న కొంత చెత్తను చీపురు పట్టుకుని ఊడవడం తప్ప వాస్తవంగా పూర్తిస్థాయిలో కార్యక్రమ స్ఫూర్తిని అందిపుచ్చుకున్నవాళ్లు తక్కువే. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఈ విషయంలో అందరి కంటే ఓ అడుగు ముందుకేసింది. ముంబైలోని వెర్సోవా సమీపంలో పూర్తి చెత్తకుప్పలతో నిండి ఉన్న ప్రాంతాన్ని ఆమె ఎంచుకుంది. ఆ ప్రాంతంలో ఒకటి, రెండు రోజులు కాకుండా మొత్తం 16 రోజుల పాటు తన బృందంతో కలిసి చెత్త మొత్తాన్ని శుభ్రం చేయించింది. అక్కడ వాతావరణం అంతటినీ సమూలంగా మార్చేసింది.

మొక్కలు నాటించి, ఇళ్లకు రంగులు వేయించి, అక్కడ అందరికీ అవగాహన పెంచింది. తాను అనుకున్న సమయం కంటే కొంచెం ఎక్కువే పట్టిందని, స్వచ్ఛభారత్ చేపట్టిన వాళ్లలోని నవరత్నాల్లో ఒకరిగా ఉండాలని ప్రధాని తనకు చెప్పారని, దాంతో తాను చాలా ఉద్వేగానికి గురయ్యానని అన్నారు. అప్పుడే.. సుదీర్ఘకాలం పాటు ఉండేలా ఏదైనా కార్యక్రమం చేపట్టాలని అనుకున్నానని ప్రియాంక చెప్పారు. అగ్నిపథ్ సినిమా షూటింగ్ సమయంలో తాను చూసిన వెర్సోవా ప్రాంతాన్ని ఆమె ఎంచుకున్నారు.

పిల్లలు చెత్తకుప్పల మీదే ఆడుకోవడం అప్పట్లో చూశానని, అందుకే కేవలం శుభ్రం చేయడంతో సరిపెట్టకుండా ఆ ప్రాంతం మొత్తాన్ని మార్చేయాలనుకున్నానని తెలిపారు. తాను ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత మరికొందరిని కూడా ఆమె నామినేట్ చేశారు. వారిలో విక్రమ్జిత్ సాహ్నీ, సన్ ఫౌండేషన్, దర్శకుడు మధుర్ భండార్కర్, సిద్ధార్థ రాయ్ కపూర్, ఐఐఎం అహ్మదాబాద్ విద్యార్థులు, అధ్యాపకులు, ప్రణయ్ రాయ్, విక్రమ్ చంద్ర, ఎన్డీటీవీ బృందం, ముంబైలోని టాక్సీ, ఆటోరిక్షా యూనియన్లు, లయన్స్ క్లబ్ ఆఫ్ ముంబై.. ఇలాంటి సంస్థలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement