రాజ్‌నాథ్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న రామభక్తులు | People Disrupts Rajnath Singh speech In Lucknow | Sakshi
Sakshi News home page

రాజ్‌నాథ్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న రామభక్తులు

Dec 24 2018 11:41 AM | Updated on Dec 24 2018 1:14 PM

People Disrupts Rajnath Singh speech In Lucknow - Sakshi

లక్నో: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఉత్తర ప్రదేశ్‌లో చేదు అనుభవం ఎదురైంది. తన సొంత నియోజకవర్గం లక్నోలో ఆదివారం పర్యటించిన ఆయనకు రామభక్తులు ఊహించని ఝలక్‌ ఇచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో రాజ్‌నాథ్‌ మాట్లాడుతుండగా.. ‘‘అయోధ్యలో రామమందిరం నిర్మించిన వారికే తాము ఓటువేస్తాం. వారినే ఎన్నుకుంటాం’’ అంటూ నినాదాలు చేశారు.

ఆయన ప్రసంగానికి అడ్డుపడి ఒక్కింత ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో రాజ్‌నాథ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడున్న పోలీసులు కల్పించుకుని సంయమనం పాటించాలని కోరడంతో వారు వెనుక్కి తగ్గారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement