ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం | passengers died jeep falls into deep gorge in Uttrakhand | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Nov 23 2016 12:10 AM | Updated on Apr 7 2019 3:24 PM

జీపు లోయలో పడ్డ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

డెహ్రాడూన్: జీపు లోయలో పడ్డ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని అల్మోరా ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. వేగంగా వెళ్తున్న ఓ జీపు అదుపుతప్పి అల్మోరా ప్రాంతంలోని లోయలో పడింది.

దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు మృతిచెందారని చెప్పారు. గాయపడ్డవారిని రక్షించేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. అయితే వీరు ఒకే కుటుంబానికి చెందినవారా.. ఎవరు అన్నది తెలియరాలేదు. బాధితుల పూర్తి వివరాలూ తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement