భారతదేశానికి పాకిస్థాన్ ఎప్పటికీ దావూద్ ఇబ్రహీంను అప్పగించదని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం తేల్చి చెప్పారు. మన దేశానికి లాభం చేకూర్చే ఏపనిని పాక్ చేయదని స్పష్టం చేశారు.అడ్రస్ తో సహా బయటపట్టిన విషయం తెలిసిందే.
దావూద్ ను పాక్ ఎప్పటికీ అప్పగించదు: చిదంబరం
May 13 2016 10:52 AM | Updated on Sep 4 2017 12:02 AM
న్యూఢిల్లీ: భారతదేశానికి పాకిస్థాన్ ఎప్పటికీ దావూద్ ఇబ్రహీంను అప్పగించదని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం తేల్చి చెప్పారు. మన దేశానికి లాభం చేకూర్చే ఏపనిని పాక్ చేయదని స్పష్టం చేశారు. గతంలో కూడా దావూద్ పాక్ లోనే ఉన్నాడని తమ ప్రభుత్వం చెబుతూ వచ్చిందని తెలిపారు. ప్రపంచానికంతటికీ ఈవిషయం తెలుసుని ఆయన అన్నారు. దావూద్ దుబాయ్,పాకిస్థాన్ లలోనే ఉండేవాడని చెప్పారు. దావూద్ ను భారత్ కు రప్పించక పోవడంలో ఏ ప్రభుత్వాన్ని తప్పు పట్టలేమని ఎందుకంటే పాక్ అతన్ని అప్పగించడానికి ఎప్పుడూ ఆదేశం సిద్ధంగా లేదని అన్నారు.
1993 లోముంబైలో జరిగిన బాంబు పేళుల్లలో 257 మంది మరణించిన కేసులో దావూద్ రప్పించేందుకు తాము తీవ్రంగా ప్రయత్నించామన్నారు. దావూద్ కరాచిలోనే ఉన్నాడని గతంలో తాము ఆధారాలతో సహా పాక్ కు తెలిపామన్నారు. ఆదేశం కావాలనే దావూద్ ను కాపాడుతూ వస్తోందని స్పష్టం చేశారు. ఒక టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి దావూద్ కరాచీలో నివాసమున్న ఇంటి అడ్రస్ తో సహా బయటపట్టిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement