సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులు | Pak opens fire in Poonch sector | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులు

Apr 29 2014 1:29 PM | Updated on Sep 5 2018 9:45 PM

సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులు - Sakshi

సరిహద్దుల్లో మళ్లీ పాక్ కాల్పులు

మూడు రోజుల క్రితం కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్‌ దళాలు మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డాయి.

దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ దుందుడుకు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని దాయాది దేశం ఉల్లంఘిస్తూనే ఉంది. మూడు రోజుల క్రితం కవ్వింపు చర్యలకు పాల్పడిన పాక్‌ దళాలు మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డాయి.
 
 మూడు రోజుల క్రితం పూంఛ్ సెక్టార్‌లో మోర్టార్లు, చిన్న తరహా ఆయుధాలతో కాల్పులకు దిగిన పాక్ దళాలు తాజాగా మంగళవారం రాజౌరీ జిల్లాలోని బీమ్ బేర్ లోని గాలీ ప్రాంతంలో కవ్వింపు చర్యలకు దిగాయి. భారత సైనికులను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు దిగడంతో అప్రమత్తమైన భారత బలగాలు పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. సరిహద్దులో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement