అరుణాచల్ ప్రదేశ్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర సీఎం, శాసన సభా పక్ష నాయకునిగా ఉన్న నబమ్ టుకీ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. కొత్త శాసనసభా నాయకునిగా ఎన్నికైన పెమా ఖండు ఈ రోజు బలపరీక్ష నిరూపించుకోవాల్సి ఉంది. కాగా బలపరీక్ష వాయిదా పడింది.
మొత్తం 58 మంది సభ్యులున్న శాసనసభలో కాంగ్రెస్ కు 45 మంది సభ్యులున్నారు. మరో ఇద్దరు ఇండిపెండెండ్ సభ్యుల మద్ధతు ఆపార్టీకి ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు బలపరీక్ష నిర్వహించాల్సి ఉంది. బలపరీక్షకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేనందువల్లే వాయిదా పడినట్టు సమాచారం.