కొత్త రైలు ఛార్జీలు ఇవీ... | new train fares will be like this | Sakshi
Sakshi News home page

కొత్త రైలు ఛార్జీలు ఇవీ...

Jun 20 2014 6:40 PM | Updated on Aug 20 2018 9:16 PM

పెరిగిన రైలు ఛార్జీలు ఈనెల 2వ5వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కొత్తగా పెరిగే రైలు ఛార్జీలు ఇలా ఉండబోతున్నాయి.

పెరిగిన రైలు ఛార్జీలు ఈనెల 25వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కొత్తగా పెరిగే రైలు ఛార్జీలు ఇలా ఉండబోతున్నాయి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైల్లో హైదరాబాద్‌-తిరుపతి మధ్య స్లీపర్ ఛార్జీ ప్రస్తుత ధర రూ.355 ఉండగా, పెరిగిన ధర రూ.385 కాబోతోంది. అలాగే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌-తిరుపతి స్లీపర్ ప్రస్తుత ధర రూ.365 ఉండగా, పెరిగిన ధర రూ.420 అవుతుంది. (చదవండి: రైలు ప్రయాణం మరింత భారం)

గోదావరి ఎక్స్‌ప్రెస్లో హైదరాబాద్‌-విశాఖపట్నం మధ్య స్లీపర్ క్లాస్ ప్రస్తుత ధర రూ.335 కాగా, పెరిగిన ధర రూ.405 అవనుంది. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్లో విశాఖపట్నం-బెంగళూరు మధ్య స్లీపర్ క్లాస్ ప్రస్తుత ధర రూ.435 ఉండగా పెంపు అనంతరం అది రూ.495 కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement