కేంద్రం సహాయం పెంచాలి: ఎంపీ మేకపాటి | MP Mekapati demands to increase Center Help | Sakshi
Sakshi News home page

కేంద్రం సహాయం పెంచాలి: ఎంపీ మేకపాటి

Nov 22 2014 10:59 PM | Updated on Sep 2 2017 4:56 PM

మేకపాటి రాజమోహన రెడ్డి

మేకపాటి రాజమోహన రెడ్డి

హుదుహుద్ తుపాను బాధితులకు కేంద్ర సహాయం పెంచాలని వైఎస్ఆర్ సీపి పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన రెడ్డి డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ: హుదుహుద్ తుపాను బాధితులకు కేంద్ర సహాయం పెంచాలని వైఎస్ఆర్ సీపి పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు ఇక్కడ జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు.

  హుదుహుద్ తుపానుపై పార్లమెంటులో చర్చజరపాలని ఆయన కోరారు. తుపాను వల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో భారీనష్టం సంభవించినట్లు తెలిపారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అందువల్ల వారికి కేంద్రం చేసే సాయం పెంచాలని మేకపాటి  కోరారు.
**

Advertisement
 
Advertisement
Advertisement