ఈ రోజు( బుధవారం) జరిగిన అఖిలపక్ష భేటీలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పాక్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి భారత్ దళారి దేశం కాదని జైశంకర్ అన్నట్లు తెలిపాయి. పాకిస్థాన్ను ఉద్దేశించి కౌంటర్గా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఈ రోజు (బుధవారం) కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించింది. దాదాపు రెండుగంటల పాటు సాగిన ఈ భేటీలో ప్రస్తుత పరిస్థితుల్లో దేశం తీసుకుంటున్నచర్యలను వివరించారు. కాగా ఈ సందర్బంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిని జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
అమెరికా-ఇరాన్ విషయంలో మధ్యవర్తిత్వం వహించడానికి భారత్ ప్రయత్నిస్తుందా అని జైశంకర్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి ఆయన బదులిస్తూ" భారత్ పాక్ లాగా దళారి ( మధ్యవర్తిత్వం) దేశంగా వ్యవహరించదు. 1981 నుంచి అమెరికా పాక్ను వాడుకుంటుంది". అని జైశంకర్ అన్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అయితే భారత్ ఈ విషయంలో స్పందించడం లేదు అనే వ్యాఖ్యలను సైతం జైశంకర్ తోసిపుచ్చారు. ఇండియా తన త దౌత్య మార్గాల ద్వారా నిరంతరం సంప్రదింపులు జరుపుతోందన్నారు. కాగా ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్- అమెరికా మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామంటూ పాక్ తరచుగా అంటుంది. ఈ విషయమై పాక్ అధ్యక్షుడు తనను సంప్రదించిందని ట్రంప్ సైతం తెలిపారు. ఈ నేపథ్యంలో జైశంకర్ ఇలా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.


