భవనం కూలి ఒకరి మృతి | Man dies in Delhi building collapse | Sakshi
Sakshi News home page

భవనం కూలి ఒకరి మృతి

Dec 25 2015 2:17 PM | Updated on Oct 9 2018 5:39 PM

నిర్మాణంలో ఉన్న భవనం కూలి చోటు(50) కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఓ మహిళ సహా మరో ఐదుగురు గాయపడ్డారు.

న్యూఢిల్లీ:  ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో క్రిస్మస్ పర్వదినం రోజున ఓ కార్మికుని ఇంట్లో తీరని విషాదం నిండింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఛోటు (50)  అనే కార్మికుడు  దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఓ మహిళ సహా మరో  ఐదుగురు గాయపడ్డారు. బేస్మెంట్ నుంచి మట్టిని తొలగిస్తుండగా అకస్మాత్తుగా భవనం కుప్పకూలిపోయిందని పోలీసులు తెలిపారు. భవన యజమానిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement