కోల్కతా: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ద్వారా ప్రధాని మోదీ దేశ ప్రజలను బిచ్చగాళ్లను చేశారని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ మంగళవారం ఆరోపించారు. పోస్టాఫీసులు, బ్యాంకుల ముందు క్యూలు కట్టుకుని బిచ్చగాళ్లలా నిలబడ్డారన్నారు. రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బుధవారం రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఇతర పార్టీలు కలసి వచ్చినా రాకున్నా తృణమూల్ ముందుకు సాగుతుందన్నారు. ‘బుధవారం 40 మంది తృణమూల్ ఎంపీలతో కలసి రాష్ట్రపతిని కలుస్తున్నా.అందరూ కలిసొస్తే బాగుంటుంది’ అని తెలిపారు.రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు మమత చేపట్టిన ర్యాలీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్, సీపీఎం నిర్ణయించాయి. ర్యాలీలో శివసేనపాల్గొనే అవకాశముంది.
తల్లితో మోదీ రాజకీయాలు: కేజ్రీ
న్యూఢిల్లీ: డబ్బులు మార్చుకునేందుకు ప్రధాని మోదీ తల్లి, హీరాబెన్ క్యూలో నిలుచోవటాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. 97 ఏళ్ల తల్లిని క్యూలైన్లో నిలబెట్టి రాజకీయాలు చేయటాన్ని ప్రధాని మానుకోవాలన్నారు. ఒకవేళ తనకు ఆ పరిస్థితి వస్తే తల్లి బదులుగా తనే లైన్లో నిలబడతానన్నారు. అంతకుముందు ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పెద్దనోట్ల రద్దుపై ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని రద్దుచేయాలని రాష్ట్రపతికి దీన్ని పంపనున్నారు.మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.12 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.
ఇవేనా అచ్ఛేదిన్: చిదంబరం
నోట్ల రద్దుపై ప్రధాని నిర్ణయం హాస్యాస్పదమని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. ప్రజలు కోరుకుంటున్న అచ్ఛేదిన్ ఇవేనా.. ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. ‘బ్యాంకులేమైనా నిరుద్యోగులకు భృతి ఇస్తున్నాయా? ఇవేనా అచ్ఛేదిన్’ అని ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ చేతిలో 12లక్షల కోట్లు: అమిత్ షా
అహ్మదాబాద్: నల్లధనంపై కాంగ్రెస్ నేత విమర్శలను బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించారు. యూపీఏ హయాంలో కాంగ్రెస్ నేతలు రూ.12 లక్షల కోట్లకు పైగా సంపాదించారని.. రాత్రికి రాత్రి ప్రధాని మోదీ వీటిని చిత్తుకాగితాల్లా మార్చేశారన్నారు. రూ. 4 కోట్ల కారులో రూ. 4వేల కోసం రాహుల్ బ్యాంకుకు వెళ్లటం హాస్యాస్పదమన్నారు.
జనం చస్తోంటే నవ్వులా?: రాహుల్ గాంధీ
ముంబై: నోట్ల మార్పిడి కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూల్లో నిలబడి 18-20 మంది ప్రజలు చనిపోతే.. ప్రధాని మోదీ నవ్వుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జపాన్లో మోదీ మాటలను ప్రస్తావిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. నవ్వుతున్నారో లేక బాధపడుతున్నారో ఆయనే స్పష్టంచేయాలన్నారు. పెద్ద నోట్ల మార్పిడి నిర్ణయం అసంబద్ధంగా ఉందని ధ్వజమెత్తారు.
బిచ్చగాళ్లను చేశారు: మమత
Published Wed, Nov 16 2016 1:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విడుదలకు సిద్దమైన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ ‘దర్శిని’
బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
20 ఏళ్లయినా అదే క్రేజ్.. స్టేజీపై అదరగొట్టేసింది!
రచ్చ శ్రీను కేరాఫ్ తాడేపల్లిగూడెం
విశాఖపై టీడీపీ కొత్తరాగం
తెలంగాణలో ‘RR’ ట్యాక్స్పై చర్చ నడుస్తోంది: ప్రధాని మోదీ
పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర
పాక్తో రాహుల్కు సంబంధం ఏంటి: స్మృతి ఇరానీ
ఉద్యోగం దొరికితే చాలు అనే యువతరం కాదు..అంతకుమించి..!
Regina Cassandra: టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రెజీనా (ఫొటోలు)
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement