-
రండి..రండి దయచేయండి!
పెద్ద హోటళ్లలో తగ్గిన ఆక్యుపెన్సీ నోట్ల రద్దుతో ‘ఆతిథ్యానికి’ భారీ ఎఫెక్ట్ గ్రేటర్లో రెండు నెలలుగా ఇదే పరిస్థితి మెట్రో నగరాలతో పోలిస్తే ఇక్కడే భారీ తగ్గుదల సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని లగ్జరీ హోటళ్లకు పెద్ద నోట్ల రద్దు దెబ్బ తగిలింది. ఆక్కుపెన్సీ రేటు భారీగా పడిపోయింది. అతిథుల కోసం స్టార్ హోటళ్లు సైతం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే గత రెండునెలలుగా నగరంలోనే హోటల్స్ బుకింగ్స్ అధికంగా తగపట్టినట్లు గుర్గావ్లోని ‘హోటల్ రీసెర్చ్ అసోసియేషన్’ అనే సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరంలో బుకింగ్స్ నామమాత్రంగానే తగ్గాయి. అక్కడ 71.6 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదవగా..ఢిల్లీలో 62.3 శాతం, ఆ తర్వాత కోల్కతాలో 60 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదైంది. పొరుగునే ఉన్న బెంగళూరు నగరంలో 57.8 శాతం, చెన్నైలో 57 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదవగా..మన గ్రేటర్హైదరాబాద్ నగరంలో మాత్రం 56.4 శాతమే ఆక్యుపెన్సీ ఉందని ఆ సర్వే తేల్చింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగరంలోని పలు కార్పొరేట్, ఐటీ, బీపీఓ, కేపీఓ, బల్క్డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక, ఆర్థికేతర సంస్థలు, ప్రభుత్వ విభాగాలు లగ్జరీ హోటళ్లను కాస్త దూరం పెట్టాయి. బడ్జెట్ హోటళ్లలోనే సాదాసీదాగా సమావేశాలు, సదస్సులు నిర్వహించడమూ దీనికి ప్రధాన కారణమని హోటల్రంగ నిపుణులు తెలిపారు. ఆక్యుపెన్సీ తగ్గేందుకు పలు కారణాలు.. ►నోట్ల రద్దు నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో కార్పొరేట్లు, ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల యజమానుల ఆలోచనా విధానం మారింది. ►అవనవసర ఖర్చులు, ప్రణాళికేతర వ్యయాన్ని బాగా తగ్గించడం. కాస్ట్కటింగ్ చర్యలకు ప్రాధాన్యతనివ్వడం. ►లగ్జరీ హోటళ్ల స్థాయిలో కాకపోయినా.. బడ్జెట్ హోటళ్లలోనూ సేవలు, ఆతిథ్యం, వసతులు మరింత మెరుగవడం. ►వివిధ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, మెడికల్టూరిజం, మార్కెటింగ్ తదితరాల పనుల నిమిత్తం నగరానికి వచ్చే విదేశీ, స్వదేశీ టూరిస్టులు సైతం లగ్జరీ హోటల్స్ కంటే బడ్జెట్ హోటళ్ల వైపు మొగ్గుచూపడం. ►మెట్రో నగరాల్లో గత రెండునెలలుగా లగ్జరీ హోటళ్లలో నమోదైన ఆక్యుపెన్సీ శాతం ఇలా ఉంది. భవిష్యత్ బడ్జెట్ హోటల్స్దే... రాబోయే రెండేళ్లలో(2017–19) పలు మెట్రో నగరాల్లో లగ్జరీ, సెవన్స్టార్, ఫైవ్స్టార్ హŸటల్స్ కంటే బడ్జెట్ హోటళ్లకే గిరాకీ అధికంగా ఉంటుందని తాజా సర్వే ఆధారంగా హోటల్స్ రీసెర్చ్ అసోసియేషన్ సంస్థ అంచనా వేసింది. ఆక్యుపెన్సీ(అతిథుల భర్తీ) విషయంలో బడ్జెట్హోటళ్ల సెగ్మెంట్లలో ఆయా నగరాల్లో పెరుగుదల శాతం ఇలా ఉంటుందని అంచనా వేసింది. విమానయానానికి తగలని నోట్లరద్దు సెగ... పెద్ద నోట్ల రద్దు దెబ్బకు నగరంలోని అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతోపాటు రైల్వే, ఆర్టీసీ వంటి సంస్థలకూ లాభాలు తగ్గిన విషయం విదితమే. అయితే నగరం నుంచి నిత్యం రాకపోకలు సాగించే 370 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు మాత్రం గిరాకీ ఏమాత్రం తగ్గలేదని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రోజువారీగా సుమారు 40 వేల మంది ప్రయాణికులు దేశంలోని వివిధ నగరాలతోపాటు విదేశాలకు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. పెద్దనోట్లు రద్దుతో దేశీయ,అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గించుకోలేదని పేర్కొన్నారు. విమాన టిక్కెట్లను ముందుగానే బుకింగ్చేసుకునే అవకాశం ఉండడం,నోట్లు రద్దయిన అనంతరం కూడా పాతనోట్లను చాలా కాలం టిక్కెట్ల బుకింగ్కు స్వీకరించడం, అత్యవసర ప్రయాణాలు అనివార్యం కావడం వంటి అంశాల కారణంగా విమాన ప్రయాణికులు తగ్గలేదని విశ్లేషించారు. -
నగదు రహితం సాధ్యమేనా..
డిజిటల్ లావాదేవీలపై అవగాహన లేని గ్రామీణులు బ్యాంకులకు వెళ్లడమే ఏడాదికి ఒకటి, రెండు సార్లు.. జిల్లాలో నిరక్షరాస్యులే అధికం.. నర్సంపేట : నల్లధనం వెలికితీత పేరుతో పెద్ద నోట్లను కేంద్రప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి మొదలైన సామాన్యుల కష్టాలు ఇంకా తీరడం లేదు. నోట్ల డిపాజిట్, మార్పిడికి గడువు ముగిసిన నేపథ్యంలో.. నగదు రహిత లావాదేవీల నిర్వహణ సాధ్యమేనా అనే అనుమానాలు పలువురిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్న జనాభాలో 93.01 శాతం గ్రామాల్లో నివసిస్తుండడం.. సగం మంది కూడా అక్షరాస్యులు కాకపోవడంతో ఈ జిల్లాలో నగదు రహిత లావాదేవీలు కత్తి మీద సామేనని పలువురు భావిస్తున్నారు. విరుగుడు ఇదే.. పెద్ద నోట్లను రద్దు చేశాక ఏర్పడిన అనూహ్య పరిస్థితులు సద్దుమణగాలంటే నగదు రహిత చెల్లింపులే మార్గమని ప్రభుత్వం చెబుతోంది. దీనికి అనుగుణంగా పూర్తిస్థాయిలో ప్రజలకు సాంకేతిక సేవలు అందుబాటులో లేకపోవడంతో ఇది సాధ్యమేనా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ, సగం జనాభా కూడా అక్షరాస్యులు లేని వరంగల్ రూరల్ జిల్లాలో నగదు రహిత లావాదేవీలు చేయడం సాధ్యం కాక ఆయా వర్గాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. నోట్ల మార్పిడికి బ్యాంకుల్లో ద్రువీకరణ పత్రం రాసేందుకు పేదలు ఇతరులపై ఆధారపడుతుండగా నగదు రహిత వ్యవస్థకు వరంగల్ జిల్లా ఎంత దూరమో ఇట్టే చెప్పొచ్చు. -
నేడు కాంగ్రెస్ నిరసన
కరెన్సీ కష్టాలపై కదన భేరి కలెక్టరేట్ నుంచి ఏకశిల పార్కుకు మారిన వేదిక పెద్ద ఎత్తున నిర్వహణకు పార్టీ శ్రేణుల సమాయత్తం స్థల పరిశీలన చేసిన జిల్లా నాయకులు వరంగల్ : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అఖిల భారత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తొలుత హన్మకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపాలని భావించినప్పటికి జిల్లా పోలీసు యంత్రాంగం అనుమతి ఇవ్వకపోవడంతో వేదికను బాలసముద్రంలోని ఏకశిల పార్కు(జయశంకర్ స్మృతివనం)కు మార్చారు. ఈ మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్న సభాస్థలి వద్ద చేపట్టిన ఏర్పాట్లను గురువారం డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరసన కార్యక్రమానికి ఏఐసీసీ రీజినల్ కోఆర్డినేటర్, కేరళ మాజీ శాసనసభ్యుడు పీసీ విష్ణునాథ్, జిల్లా పార్టీ పరిశీలకులు, పార్టీ సీనియర్ నా యకులు, కొత్త జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవుతున్నట్లు తెలిపా రు. కేంద్ర ప్రభుత్వం పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో సామాన్యులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నగదు కష్టాలను తీర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. జిల్లాలోని బ్యాంకులు, ఏటీఎంలల్లో నిత్యావసరాల మేరకు నోట్లను అందుబాటులో ఉంచకపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం నిరసన కార్యక్రమాల ఏర్పాట్లపై సుబేదారి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్తో రాజేందర్రెడ్డి చర్చించారు. కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, కార్యదర్శి ఈవీ.శ్రీనివాసరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోశాల పద్మ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ మెడకట్ల సారంగపాణి, నా యకులు శ్రీనివాస్రెడ్డి, మానుపాటి శ్రీనివాస్, శ్యాం, రాజు, సమద్, గణేష్ పాల్గొన్నారు. -
కరెన్సీ కష్టాలు.. కంటిన్యూ!
ఇంకా తెరుచుకోని ఏటీఎంలు.. పనిచేస్తున్న వాటిలో పెద్ద నోట్లే.. చిల్లరతో చిరు వ్యాపారుల విలవిల నిజామాబాద్ : కరెన్సీ కష్టాలు కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు చేసి సుమారు రెండు నెలలు దగ్గర పడుతున్నప్పటికీ.. ప్రజలకు నోట్ల ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లా అవసరాల మేరకు రూ.500, రూ.100 నోట్లు అందుబాటులోకి రాలేదు. దీంతో జిల్లాలో చిల్లర సమస్య తీవ్రమైంది. ఇది చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రోజువారి వ్యాపారాలు సాగక, గిరాకీలు పడిపోవడంతో రెక్కాడితే గానీ డొక్కాడని చిరువ్యాపారులు విలవిలలాడుతున్నారు. తెరుచుకోని ఏటీఎంలు.. ప్రభుత్వ, ప్రైవేటు, సహకార బ్యాంకులు కలిపి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 371 బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ బ్యాంకులకు సంబంధించి 345 ఏటీఎంలు ఉన్నాయి. ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏటీఎంలు తెరుచుకోలేదు. ఆయా బ్యాంకుల మెయిన్ బ్రాంచుల వద్ద ఉన్న కొన్ని ఏటీఎంలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొన్ని ఏటీఎంలు పనిచేయడం ప్రారంభించాయి. పనిచేస్తున్న ఈ ఏటీఎంలలో కూడా రూ.100 నోట్లు, రూ.500 నోట్లు వస్తున్న ఏటీఎంలు నామమాత్రమే. ఎక్కువ ఏటీఎంలలో రూ.2 వేల నోట్లే వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొనసాగుతున్న ఆంక్షలు.. బ్యాంకుల్లో నగదు విత్డ్రాకు ఆంక్షలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. వారానికి రూ.24 వేల పరిమితి ఇంకా ఎత్తివేయలేదు. రోజుకు ఇచ్చే రూ.4 వేల పరిమితిని కొంత సడలించారు. రూ.10 వేల వరకు ఇస్తున్నారు. దీంతో ఆయా బ్యాంకుల్లో నగదు విత్డ్రా కోసం బారులు కొంత మేరకు తగ్గాయి. కానీ.. రద్దీ మాత్రం అలాగే కొనసాగుతోంది. సుమారు రూ.6 వేల కోట్ల డిపాజిట్లు పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.6వేల కోట్ల నగదు డిపాజిట్ అయినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా ఖాతాదారులు రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను తమ ఖాతాల్లో వేస్తున్నారు. అయితే డిపాజిట్ల మేరకు కొత్త కరెన్సీ అందుబాటులో లేకపోవడంతో నోట్ల కష్టాలు కొనసాగుతున్నాయి. సుమారు రూ.6వేల కోట్లు డిపాజిట్లు అయితే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే జిల్లాకు కొత్త కరెన్సీ వచ్చినట్లు బ్యాంకు ఉన్నతాధికారుల అంచనా. అంటే డిపాజిట్లు అయిన మొత్తంలో కనీసం 20 శాతం కూడా కొత్త నోట్లు జిల్లాకు రాలేదు. ఇలా జిల్లా అవసరాల మేరకు కరెన్సీ జిల్లాకు చేరకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం కరెన్సీ కోసం పలుమార్లు ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. యథేచ్ఛగా అక్రమాలు.. సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే నల్ల కుబేరులు తమ బ్లాక్ మనీని పెద్ద మొత్తంలో వైట్ మనీగా మార్చుకున్నారు. ఇందుకు కొన్ని బ్యాంకు అధికారులు, సిబ్బంది సహకారంతో భారీ మొత్తంలో నగదు అక్రమ మార్పిడి జరిగింది. ముఖ్యంగా బడా వ్యాపారులకు బ్యాంకు అధికారులు సహకరించారనేది బహిరంగ రహస్యంగా మారింది. నల్లదనం ఉన్న వారు తమ కరెన్సీని రూ.100 నోట్లుగా మార్చుకుని తమ వద్ద ఉంచుకోవడంతో కూడా చిల్లర సమస్యకు పరోక్ష కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పాత నోట్లు.. రూ.350 కోట్లు
గడువు ముగిసే సమయానికి బ్యాంకుల్లో డిపాజిట్ ఒక్కో పట్టణంలో రూ.కోటికి పైగానే.. ఇంకా తెరుచుకోని ఏటీఎంలతో ప్రజల ఇక్కట్లు కానరాని రూ.100 నోట్లు.. రూ.500 నోట్లూ అక్కడక్కడే! ఆత్మకూరు : కేంద్రప్రభుత్వం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసి రెండు నెలలు కావస్తున్నా సాధారణ ప్రజల కష్టాల అంతు తేలడం లేదు. చెలామణి నిలిపివేసిన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్, మార్పిడికి కేంద్రం అప్పట్లో అవకాశం కల్పించింది. కానీ నోట్ల మార్పిడిని రద్దు చేసిన ప్రభుత్వం బ్యాంకుల్లో ఖాతాదారులు మాత్రమే జమ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ తన ఉత్తర్వులను సవరించింది. ఈ మేరకు డిసెంబర్ 30వ తేదీతో బ్యాంకుల్లో పాత నోట్లను జమ చేసుకునే గడువు ముగియగా.. అప్పటి వరకు డిపాజిట్ అయిన మొత్తం వివరాలను బ్యాంకుల వారీగా ఆన్లైన్లో నిక్షిప్తం చేశారు. ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకుల్లోనే.. వరంగల్ రూరల్ జిల్లాలో ఎక్కువగా ఎస్బీహెచ్, ఆంద్రా బ్యాంకులోనే డిపాజిట్లు జరిగాయి. ఒక్క పరకాల పట్టణంలోని ఎస్బీహెచ్లోనే రూ.80కోట్ల 50లక్షలు డిపాజిట్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇలా జిల్లా మొత్తం రూ.350 కోట్ల మేరకు పాత నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. 17 బ్యాంకులు.. 64 శాఖలు జిల్లాలో 17 బ్యాంకులకు సంబంధించి 64 శాఖలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 57 ఏటీఎంలు ఉండగా అందులో 45ఏటీఎంలు సరిగా పనిచేయడం లేదు. పనిచేస్తున్న వాటిల్లోనూ డబ్బు లోడ్ చేసిన గంట, రెండు గంటల్లో ఖాళీ అవుతున్నాయి. మంగళవారం కూడా అధికంగా ఏటీఎంలు మంగళవారం మ««ధ్యాహ్నం వరకే ఖాళీ అయ్యాయి. సంగెం ఆంధ్రాబ్యాంకులో ఏటీఎంలో రూ.4లక్షలకు పైగా లోడ్ చేసినా సాయంత్రం తర్వాత ఖాతాదారులకు డబ్బు లభించలేదు. ఇక జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఉన్న ఏటీఎంల్లో రూ.100 నోట్లు కరువయ్యాయి. పెద్ద నోట్లను రద్దు చేసినప్పటికీ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో పనిచేసే పది, పదిహేను ఏటీఎంల్లో రూ.2వేల నోట్లే లోడ్ చేస్తున్నారు. ఇక నూతన రూ.500నోట్లు విడుదలైనా చాలా తక్కువగా ఖాతాదారులకు అందుతున్నాయి. రుణాల విషయంలో కరువైన స్పష్టత ఖాతాదారులు పాత నోట్లను జమ చేసే గడువు ముగిసి నాలుగు రోజులు దాటింది. అయినప్పటికీ రైతులు, వ్యాపారులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఫసల్ భీమా యోజన దరఖాస్తుకు గడువు గత నెల 31తో ముగిసినా ఇంకా పది రోజులు పొడిగించారు. ఇక బ్యాంకర్లు రుణాల విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అన్ని వర్గాల
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement