కరెన్సీ కష్టాలపై కదన భేరి
కలెక్టరేట్ నుంచి ఏకశిల పార్కుకు మారిన వేదిక
పెద్ద ఎత్తున నిర్వహణకు పార్టీ శ్రేణుల సమాయత్తం
స్థల పరిశీలన చేసిన జిల్లా నాయకులు
వరంగల్ : పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అఖిల భారత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తొలుత హన్మకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపాలని భావించినప్పటికి జిల్లా పోలీసు యంత్రాంగం అనుమతి ఇవ్వకపోవడంతో వేదికను బాలసముద్రంలోని ఏకశిల పార్కు(జయశంకర్ స్మృతివనం)కు మార్చారు. ఈ మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్న సభాస్థలి వద్ద చేపట్టిన ఏర్పాట్లను గురువారం డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరసన కార్యక్రమానికి ఏఐసీసీ రీజినల్ కోఆర్డినేటర్, కేరళ మాజీ శాసనసభ్యుడు పీసీ విష్ణునాథ్, జిల్లా పార్టీ పరిశీలకులు, పార్టీ సీనియర్ నా యకులు, కొత్త జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవుతున్నట్లు తెలిపా రు.
కేంద్ర ప్రభుత్వం పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో సామాన్యులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నగదు కష్టాలను తీర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. జిల్లాలోని బ్యాంకులు, ఏటీఎంలల్లో నిత్యావసరాల మేరకు నోట్లను అందుబాటులో ఉంచకపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం నిరసన కార్యక్రమాల ఏర్పాట్లపై సుబేదారి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్తో రాజేందర్రెడ్డి చర్చించారు. కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, కార్యదర్శి ఈవీ.శ్రీనివాసరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పోశాల పద్మ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ మెడకట్ల సారంగపాణి, నా యకులు శ్రీనివాస్రెడ్డి, మానుపాటి శ్రీనివాస్, శ్యాం, రాజు, సమద్, గణేష్ పాల్గొన్నారు.
నేడు కాంగ్రెస్ నిరసన
Published Fri, Jan 6 2017 12:53 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రామోజీ ఈ వయసులో ఇదేం పని... ఇప్పటికైనా మారకపోతే..
కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
శ్రీకాకుళంలో ఎగిరేది YSRCP జండానే..
కొండెక్కిన చికెన్! మంట పుట్టిస్తున్న మటన్..
హిమాచల్ అడవుల్లోనూ కార్చిచ్చు
అయోమయంలో పురందేశ్వరి భవితవ్యం
తెలుగు ఓటర్లు కీలకం
నాలుగు మాటల్లో.. ఈ చిత్రకారుడి కథ!
కడుపు మంటతోనే టీడీపీ దాడులు
తప్పక చదవండి
- MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
- కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- వారి ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్న పాయల్ రాజ్పుత్
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- సానుకూల సంకేతాలు
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement