ఏ ’మనీ’ చెప్పేది... | money problems in karnataka | Sakshi
Sakshi News home page

ఏ ’మనీ’ చెప్పేది...

Nov 20 2016 2:34 AM | Updated on Sep 4 2017 8:33 PM

ఏ ’మనీ’ చెప్పేది...

ఏ ’మనీ’ చెప్పేది...

గదగ్ జిల్లా రోణా తాలూకా హీరేహళ్ గ్రామంలో ప్రస్తుతం కొంతమంది రైతులు తాము పండించిన జొన్నలను స్థానిక సంతలో ...

► గదగ్ జిల్లా రోణా తాలూకా హీరేహళ్ గ్రామంలో ప్రస్తుతం కొంతమంది రైతులు తాము పండించిన జొన్నలను స్థానిక సంతలో కాయగూరలు విక్రరుుంచే వారికి ఇచ్చి వారి నుంచి కాయగూరలను తీసుకుంటున్నారు. దీంతో పూర్వపు వస్తుమార్పిడి పద్దతి వచ్చిందని అక్కడి స్థానికులు వాపోయారు.

► రామనగర్‌కు చెందిన రమేష్ అతని స్నేహితులు ఏడాది పాటు చీటీలు వేసి కొంత నగదు దాచిపెడుతారు. ఈ సొమ్ముతో ప్రతి ఏడాది శబరిమలె వెలుతుంటారు. అరుుతే పెద్ద నోట్ల రద్దు వల్ల సరిపడ కొత్తనోట్లు దొరక్కపోవడం వల్ల తమ యాత్రను జనవరికి వారుుదా వేసుకున్నారు. 

► మైసూరు జిల్లా దండికెర గ్రామానికి చెందిన మోతుబరి హీరేమఠ్ తన కుమార్తె పెళ్లికి రూ. 10 లక్షలకు పైగా దాచిపెట్టాడు. పెద్ద నోట్ల రద్దుతో ఆ మొత్తాన్ని అతను బ్యాంకు నుంచి తీసుకోలేకపోయాడు. దీంతో రెండు రోజుల ముందు తన కుమార్తె పెళ్లిని సాదాసీదాగా ముగించాడు. చివరికి ముహుర్తానికి పట్టుచీరను కొత్తది కొనలేకపోయానని వాపోయాడు. 

► నోట్ల రద్దు వల్ల పాడి రైతులకు వారం నుంచి సహకార సంఘాల ద్వారా సొమ్ములు చెల్లించడం లేదు. దీంతో పాడి రైతులు పశువులకు అవసరమైన దాణాను కొనలేకపోతున్నారు. ఫలితంగా రెండు రోజులుగా పాల ఉత్తత్తి తగ్గుతోందని రైతులు చెబుతున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement