అదే వరస..ఆగని కేసులు..

Maharashtra Reports 2,250 New Cases - Sakshi

మహారాష్ట్రను వీడని మహమ్మారి

ముంబై : కరోనా వైరస్‌ కేసులు మహారాష్ట్రను వణికిస్తూనే ఉన్నాయి. రోజురోజుకూ వైరస్‌ ఉధృతి పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. మహారాష్ట్రలో బుధవారం 2250 తాజా కేసులు వెలుగుచూడటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 39,297కి పెరిగింది. ఇక కోవిడ్‌-19 హాట్‌స్పాట్‌గా మారన ముంబై మహానగరంలోనూ మహమ్మారి నియంత్రణలోకి రాలేదు. ముంబైలో 1372 కొత్త కేసులు బయటపడ్డాయి. మహమ్మారి బారినపడి నగరంలో ఒక్కరోజే 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో మొత్తం కోవిడ్‌-19 మరణాల సంఖ్య 1390కి పెరగ్గా, ముంబైలో మృతుల సంఖ్య 841కి చేరింది. ఇక ముంబైలోని అతిపెద్ద మురికివాడలో 25 తాజా కేసులు వెలుగుచూడగా ఆ ప్రాంతంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1378కి పెరిగింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top