60కి చేరిన పుణె మృతుల సంఖ్య | Maharashtra Pune landslide: Toll rises to 60 | Sakshi
Sakshi News home page

60కి చేరిన పుణె మృతుల సంఖ్య

Aug 1 2014 1:24 PM | Updated on Oct 8 2018 5:45 PM

మహారాష్ట్రలోని పుణే జిల్లా మాలిన్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

పుణె : మహారాష్ట్రలోని పుణే జిల్లా మాలిన్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో మృతుల సంఖ్య 60కి చేరింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా శిథిలాల కింద 100 మందికిపైగా ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఎడతెరిపిలేని వర్షాలు, ప్రతికూల వాతావరణం జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలకు అడ్డంకిగా మారాయి. భారీ వర్షాలు, పేరుకుపోయిన మట్టి, పెద్దపెద్ద బండ రాళ్ల కారణంగా శిథిలాల కింద ఉన్న వారు ప్రాణాలతో ఉండేది అనుమానంగా మారింది.

 

Advertisement
 
Advertisement
Advertisement