హిజ్రాలను ఏ జైల్లో నిర్బంధించాలి?

Madras High Court On Third Gender On Jail Prison - Sakshi

సబ్‌ కోర్టులకు మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వులు

సాక్షి, చెన్నై : సాధారణంలో జైల్లో మహిళలకు, పురుషులకు వేరువేరుగా జైళ్లు ఉంటాయి. కానీ థర్డ్‌ జెండర్‌ ( హిజ్రా)లకు ప్రత్యేకంగా కారాగారాలు లేవు. ఈ నేపథ్యంలోనే హిజ్రాలను ఎక్కడ నిర్బంధించాలని అనే దానిపై మద్రాస్‌ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఓ కేసు విచారణ నిమిత్తం.. కింద కోర్టులకు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తమిళనాడు, పుదుచ్చేరిలో గల సెషన్స్‌ కోర్టులకు హైకోర్టు కొత్త నింబంధనలు రూపొందించింది. ఈ నింబంధన రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో విడుదల చేశారు. కొత్త నిబంధనల ప్రకారం అరెస్టయిన వారిని నేరుగా హాజరుపరిస్తే మాత్రమే వారిని జైలుల్లో నిర్బంధించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని, నేర కేసుల్లో అరెస్లయిన హిజ్రాలను జిల్లా వైద్య అధికారిచే పరీక్షలు జరిపించాలని పేర్కొంది. ఈ నివేదన ఆధారంగా మగ లక్షణాలు అధికంగా ఉంటే పురుషుల జైలుల్లో, ఆడ లక్షణాలు ఎక్కువగా ఉంటే మహిళల జైలులో నిర్బంధించవచ్చని హైకోర్టు తెలిపింది.  ఇలాంటి సందర్భంగా చాలా అరుదుగా ఎదురువుతాయని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top