లాక్‌డౌన్‌ నుంచి పలు షాపులకు మినహాయింపులు

Lockdown Exemptions For Some Sectors - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులను ప్రకటించింది. ఈ సడలింపులతో ప్రజలకు స్వల్ప ఊరటనిచ్చింది. లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి దేశంలోని అర్బన్‌ ప్రాంతాల్లోని నాన్‌ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయి. మొబైల్‌ రిచార్జ్‌, సిమెంట్‌, పుస్తకాల షాపులు వంటి వాటికి కేంద్రం లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాటు కల్పించింది. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు లేవని తెలిపింది.

ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ గురువారం మీడియా సమవేశం ద్వారా వివరాలను వెల్లడించారు. గ్రామీణ ఆర్ఠిక వ్యవస్థను గాడిలో పడేసేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. దేశంలో వైద్య సిబ్బందికి పూర్తి భద్రతను కల్పిస్తామన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా నోడల్‌ అధికారులను నియమిస్తామని తెలిపారు.

వీటికే మినహాయింపులు..

  • పుస్తకాలు, స్టేషనరీ షాపులు
  • నిర్మాణ రంగానికి సంబంధించిన మెటిరీయల్‌ షాపులు
  • మొబైల్‌ రిచార్జ్‌ షాపులు
  • రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఎత్తివేత
  • ఫ్యాన్లు విక్రయించే ఎలక్ట్రికల్‌ దుకాణాలు
  • సిమెంట్‌ విక్రయాలకు అనుమతి
  • పిండి మిల్లులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top