
రాంచీ: దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసుకున్న పెరోల్ విజ్ఞప్తిపై గురువారం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో జరిగే తన పెద్ద కొడుకు, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ వివాహానికి హాజరయ్యేందుకు ఈ నెల 10 నుంచి 14 వరకు అనుమతివ్వాలని లాలూ పెరోల్కు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన విజ్ఞప్తి ఇంకా పరిశీలన దశలోనే ఉందని, గురువారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని జార్ఖండ్ ఐజీ(జైళ్లు) హర్ష మంగ్లా చెప్పారు.