కేజ్రీవాల్‌కు మూడు చోట్ల ఓటు: బీజేపీ | Kejriwal enrolled as voter in three places: BJP tells Election commission | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌కు మూడు చోట్ల ఓటు: బీజేపీ

Nov 25 2013 2:48 AM | Updated on Aug 20 2018 3:46 PM

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు గట్టిపోటీ ఇస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు గట్టిపోటీ ఇస్తున్న ఆమ్‌ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మూడు ప్రాంతాల్లో ఓటరుగా నమోదయ్యారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహిబాబాద్‌లో, ఢిల్లీలోని సీమాపురి, న్యూఢిల్లీ నియోజకవర్గాల్లోనూ ఆయన ఎన్నికల గుర్తింపు కార్డు పొందారని బీజేపీ నేతలు ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement