ఇబోలా.. పశ్చిమాఫ్రికాలో విపరీతంగా వ్యాపించిన ఈ వైరస్ కేవలం కొన్ని వారాల్లోనే 900కు పైగా ప్రాణాలు బలిగింది. ఇప్పటివరకు అయితే ఇది కేవలం లైబీరియా, గినియా, సియెర్రా లియోన్, నైజీరియా దేశాలకు మాత్రమే పరిమితమైంది. అయితే.. మన దేశానికి కూడా ఇది ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ఎందుకంటే, ఇబోలా వైరస్ వ్యాపించిన దేశాల్లో దాదాపు 45వేల మంది భారతీయులు పనిచేస్తున్నారు. అక్కడ పరిస్థితి మరీ విషమిస్తే వీరందరినీ వీలైనంత త్వరగా వెనక్కి రప్పించాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పార్లమెంటులో తెలిపారు.
గినియాలో 500 మంది, లైబీరియాలో 3వేల మంది, సియెర్రా లియోన్లో 1200మంది భారతీయులున్నారు. నైజీరియాలో అయితే ఏకంగా 40 వేల మంది భారతీయులు ఉన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా 300 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది లైబీరియాలో పనిచేస్తున్నారు. ఇప్పటికే 1603 మందికి ఇబోలా వైరస్ సోకిందని, వారిలో 887 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో భారతీయులకు కూడా పరిస్థితి ప్రమాదకరంగానే కనిపిస్తోంది. భారతీయుల్లో ఎవరికైనా ఈ వైరస్ సోకి.. అది తెలియకుండా వాళ్లు స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తే పరిస్థితి ఏంటని మన అధికారులు ఆందోళన చెందుతున్నారు.
పశ్చిమాఫ్రికాలో చింపాంజీలు, ఇతర జంతువులతో సన్నిహితంగా ఉన్న వాళ్లలోనే ముందుగా ఈ వైరస్ సోకిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా ఇది చింపాంజీలు, గబ్బిలాల నుంచి మనుషులకు, తర్వతా మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని తెలిపారు. ఈ వైరస్ సోకినవారి చర్మం పక్కవారికి తగిలినా.. వారికి కూడా వచ్చేస్తుందని, వాతావరణం ద్వారా కూడా వ్యాపిస్తుందని హెచ్చరిస్తున్నారు. వీళ్లకు చికిత్స చేస్తున్నవారు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. లేనిపక్షంలో వాళ్లకు కూడా సోకుతుందని చెబుతున్నారు. ఈ భయంతోనే నైజీరియా లాంటి ప్రాంతాల్లో వైద్యవర్గాలు ఇబోలా బాధితులకు చికిత్స చేయడానికి కూడా వెనకాడుతున్నారు.
ఈ వ్యాధి భారతదేశానికి వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న దేశాల నుంచి ఎవరెవరు భారతదేశానికి వస్తున్నారు, వాళ్ల తుది గమ్యం ఎక్కడ అనే విషయాలను ముందుగానే తెలుసుకుంటోంది. కానీ అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో ఇబోలా బాధితులకు ఉన్న చికిత్స సదుపాయాలు మాత్రం ఇంతవరకు భారత్లో లేవు. అవి కూడా వస్తే తప్ప భారతీయులకు ఈ వైరస్ నుంచి పూర్తి రక్షణ లభించినట్లు చెప్పలేం.
భారతదేశానికీ 'ఇబోలా' ముప్పు!!
Published Thu, Aug 7 2014 11:00 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బ్రిటన్లో అత్యంత సంపన్నుడు భారతీయుడే..!
మల్లె మొగ్గ మూవీ సక్సెస్ మీట్.. పోస్టర్ లాంఛ్!
నా పై వచ్చిన అతి పెద్ద ఆరోపణ అదే: ప్రధాని మోదీ
పాయల్ రాజ్పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!
ఐఫోన్పై రూ.26వేలు డిస్కౌంట్.. ఎక్కడంటే..
బస్ సర్వీస్ ప్రారభించనున్న ఉబర్.. మొదట ఆ నగరంలోనే..
ఓటేసిన వ్యాపార ప్రముఖులు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
తప్పక చదవండి
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement