భారత్‌, చైనా మధ్య 15 గంటల సుదీర్ఘ చర్చలు

India, China Army Officers Talks On For 15 hours Meet On Border Tension - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌- చైనా సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తలను తొలగించడానికి భారత్‌-చైనా మధ్య జరిగిన కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు ముగిశాయి.  లద్ధాఖ్‌లోని చుషుల్‌లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన చర్చలు,  బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ముగిశాయి. సుమారు 15 గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. భారత ప్రతినిధి బృందానికి లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నాయకత్వం వహించగా, సౌత్ జిన్జియాంగ్ సైనిక ప్రాంత కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ చైనా వైపు నాయకత్వం వహించారు. జూన్ 15 న గాల్వన్ లోయ ఘర్షణ తరువాత  ఇరు దేశాల మధ్య ఇంత సుదీర్ఘంగా చర్చలు జరగడం ఇదే తొలిసారి. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.  

చదవండి: సైనికుల అంత్యక్రియలు.. చైనా అభ్యంతరం!

గాల్వన్ లోయలో భారత్‌ - చైనా సరిహద్దు వద్ద హింసాత్మక ఘటనలు చోటు చేసుకోక ముందు తూర్పు లద్దాఖ్‌లో ఉన్న పరిస్థితులను పూర్తిగా  యధాతధంగా పునరుద్ధరించాలని భారతదేశం పట్టుబడుతోంది. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంట ఉన్న సాయుధ బలగాలు, ఆయుధాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఇరు దేశాలు చర్యలు చేపట్టాలని కోరారు. లద్ధాఖ్‌లోని కొన్ని ప్రాంతాలను తమ భూభాగాలుగా చైనా కొనసాగిస్తూ చేస్తున్న కొత్త వాదన పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఈ విషయానికి సంబంధించి చైనా భారత్‌ మధ్య  నాలుగు సార్లు చర్చలు జరిగాయి.  చైనా  ఇప్పటికే గోగ్రా, హాట్ స్ప్రింగ్స్, గాల్వన్ లోయ నుంచి తమ సైన్యాన్ని  వెనక్కి తీసుకుంది.  భారత్‌- చైనా మధ్య జరిగిన కాల్పులలో భారత్‌కు చెందిన ఇరవై మంది సైనికులు తమ ప్రాణాలను అర్పించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top